-పలుకుబడులు
ఇది పాలకులందరికీ వర్తిస్తుంది. ప్రధాని నుంచి పంచాయతీ సర్పంచి వరకు ఎవరైనా సరే.. న్యాయబద్ధంగా పాలన సాగించాలని జానపదులు చేసిన హెచ్చరిక ఈ సామెత. నీతిమంతుడైన రాజుకు ప్రకృతి కూడా సహకరిస్తుందని ఓ నమ్మకం. రాజు నీతిమంతంగా ప్రజలను పాలిస్తే.. ప్రజలు కూడా ధర్మబద్ధులై, చట్టానికి కట్టుబడి ఉంటారు. అదే రాజు నీతి తప్పితే.. ప్రకృతి ప్రకోపిస్తుందట. వర్షాలు సరిగా పడక, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తాయట. నేల కూడా సారం తప్పడం వల్ల పంటలు సరిగా పండక కరువు పుట్టుకొస్తుందని, ప్రజలు ధర్మాన్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారని, అవినీతి వల్ల ధరలు భగ్గుమంటాయని ఓ విశ్వాసం. శ్రీలంక వంటి దేశాలే ఇందుకు ఉదాహరణ. కాబట్టే ‘యథా రాజా తథా ప్రజా’ అన్నారు పెద్దలు.
-డప్పు రవి