1 ప్రపంచంలోనే మొట్టమొదటి నల్ల పులుల సఫారీ మనదేశంలో ఏర్పాటు కానున్నట్టు వార్తలు వచ్చాయి.
ఏ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఇది? ఎక్కడ?
2 నోటి ద్వారా తీసుకునే గర్భ నిరోధక మాత్ర ‘సహేలి’ని రూపొందించిన శాస్త్రవేత్త ఇటీవల మరణించారు. తన
సేవలకు పద్మశ్రీ కూడా అందుకున్న ఆ ఆవిష్కర్త ఎవరు?
3 207.8 బిలియన్ డాలర్ల సంపదతో భూమ్మీద అత్యంత సంపన్నుడిగా తొలిస్థానాన్ని దక్కించుకున్న ఫ్రాన్స్కు చెందిన వ్యాపార దిగ్గజం
4 202425 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ కట్టడాల నామినేషన్లకు భారత ప్రభుత్వం ఏ నిర్మాణాలను ప్రతిపాదించింది?
5 ప్రముఖ సోషలిస్టు నాయకుడు కర్పూరీ ఠాకూర్కు మరణానంతరం భారతరత్న ప్రకటించారు. అణగారిన వర్గాల పక్షాన నిలిచి ‘జననాయకుడి’గా ప్రసిద్ధిచెందిన కర్పూరీ ఠాకూర్ ఏ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఏ పార్టీ తరఫున?
6 ‘టోక్యో టు డోజో టు’ అనే సైన్స్ కాల్పనిక నవలకు ఇటీవల జపాన్ దేశపు అత్యున్నత సాహితీ పురస్కారం ‘అకుటగవా ప్రైజ్’ లభించింది. దాదాపు 5 శాతం రచనను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని రాశానని రచయిత ప్రకటించారు. ఆమె ఎవరు?
7 ఇటీవల జరిగిన జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఓ తెలుగు చిత్రం ఉత్తమనటి, ఉత్తమ సౌండ్ డిజైన్, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నది. అది ఏది?
8 పదేండ్లుగా ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ ట్రోఫీ ప్రధానంగా రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్ మధ్యే తిరిగింది. కానీ, 2024లో ఈ టోర్నీని కొత్త విజేత దక్కించుకున్నాడు. ఆ ఇటలీ యువ సంచలనం ఎవరు?
9 భారత ప్రభుత్వం 2024 ఏడాదికి తెలంగాణ కళాకారులు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. వీరు ఏ కళలకు చెందినవారు?
10 బెంగాలీ చిత్ర పరిశ్రమలో ప్రధాన స్రవంతి చిత్రాలు, సమాంతర చిత్రాల్లో ప్రతిభ కనబరిచిన ప్రసిద్ధ నటి ఒకరు క్యాన్సర్తో పోరాడుతూ జనవరి 27న మరణించారు. ఆమె ఎవరు?