1927 సైమన్ కమిషన్
1919 చట్టాన్ని సమీక్షించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో 1927లో ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. సైమన్ కమిషన్ 1927 ఫిబ్రవరి 3వ తేదీన భారతదేశాన్ని సందర్శించింది. ఈ కమిషన్లో భారతీయులు ఎవరూ లేనందున ఈ కమిషన్ను తిరస్కరించారు. ఈ కమిషన్ ఏక పక్షంగా భారత్లో రాష్ర్టాలను సందర్శించి ఒక నివేదికను తయారు చేసి 1930లో బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది.
సైమన్ కమిషన్ సిఫారసులు
1. సైమన్ కమిషన్ నివేదికలను 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో సమీక్షించారు.
2. రాష్ర్టాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలని కమిషన్ చూచించింది.
నెహ్రూ నివేదిక (1928)
భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ 1927 నవంబర్లో బ్రిటన్ ఎగువసభలో మాట్లాడుతూ అందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా? అని సవాలు విసిరారు. ఈ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928 మే 19న బొంబాయిలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. 1928 ఆగస్టు 10న రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 8 మంది సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని నియమించింది. పండిట్ జవహార్లాల్ నెహ్రూ దీనికి కార్యదర్శిగా పనిచేశారు.
ముఖ్యాంశాలు
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం
1930 నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19 వరకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో జరిగింది. ఇందులో 89 మంది ప్రముఖ రాజనీతిజ్ఞులు పాల్గొన్నారు. కానీ భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు. ఈ సమావేశంలో భావి భారత రాజ్యాంగం సమాఖ్యగా ఉండాలా? లేదా ఏక కేంద్రంగా ఉండాలా? అనే అంశంపై చర్చించారు. కాంగ్రెస్ పాల్గొనకపోవడం వల్ల చర్చలో వాస్తవమైన ప్రగతి సాధ్యం కాలేదు. సమావేశంలో పాల్గొనని ప్రజావర్గాల సహకారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానమంత్రి మెక్డోనాల్డ్ సమావేశాన్ని ముగించారు.
మొదటి రౌండ్టేబుల్ సమావేశంలో ముస్లింలీగ్ తరుపున జిన్నా, ఆగాఖాన్, మహ్మద్ ఆలీ, మహ్మద్ షా, ఫజల్ హక్బీ హిందూ మహాసభ తరపున తేజ్ బహుదూర్ సప్రూ, చింతామణి, శ్రీనివాస శాస్త్రి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, హైదరాబాద్ దివాన్ అక్బర్ హైదర్ పాల్గొన్నారు.
రెండో రౌండ్ టేబుల్ సమావేశం
1931 సెప్టెంబర్ 7 నుంచి డిసెంబర్ 7 వరకు లండన్లో రెండో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇర్విన్తో చేసుకున్న ఒడంబడిక ప్రకారం కాంగ్రెస్ తరపున గాంధీజీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో అన్ని స్వదేశీ సంస్థానాధిపతులతో పాటు 107 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మహిళా ప్రతినిధిగా సరోజినీ నాయుడు, బలహీన వర్గాల తరపున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ముస్లిం వర్గాలకు రెండు కొత్త ప్రావిన్సులను (నార్త్ వెస్ట్ ప్రావిన్స్, సింధ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీజీ దీన్ని ‘విభజించు పాలించు’ విధానంగా భావించి తీవ్రంగా వ్యతిరేకించారు. అల్ప సంఖ్యాక-వర్గాల సమస్యపై ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. బ్రిటిష్ ప్రధానమంత్రి, తాను దారులు వేరయ్యే చోటుకే వచ్చానని గాంధీజీ ప్రకటించారు.
కమ్యూనల్ అవార్డు (1932)
మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి సంబంధించి నాటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ 1932 ఆగస్టు 4న ఒక ప్రతిపాదన చేశారు. దీన్ని కమ్యూనల్ అవార్డు అంటారు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు కూడా ప్రత్యేక నియోజక గణాలను ప్రతిపాదించారు. దీన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమర్థించారు. మహాత్మాగాంధీ దీన్ని వ్యతిరేకిస్తూ పుణేలోని ఎరవాడ కారాగారంలో 1932 సెప్టెంబర్ 20న అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాజాజీ, మదన్ మోహన్ మాలవ్య లాంటి నాయకులు చొరవ తీసుకొని అంబేద్కర్, గాంధీజీతో చర్చించి దీక్షను విరమింపజేశారు. 1932 సెప్టెంబర్లో పుణే ఒప్పందం కుదిరింది. తద్వారా కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలకు అవకాశాలు లభించాయి.
మూడో రౌండ్ టేబుల్ సమావేశం
1932 నవంబర్ 17 నుంచి డిసెంబర్ 24 వరకు లండన్లో మూడో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్రిటిష్ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తారని భావించిన వారెవరికి ఆహ్వానం పంపలేదు. అందువల్ల కాంగ్రెస్ ప్రతినిధులు సమావేశానికి హాజరుకాలేదు. ఇంగ్లండ్లోని లేబర్ పార్టీ కూడా దీనికి సహకరించలేదు. ఇందులో అంతకు ముందు నియమించిన ఉపసంఘాల నివేదికలపై చర్చించారు. ఈ సమావేశంలో చేసిన సిఫార్సులకు సంబంధించిన అనేక అంశాలను 1935 భారత ప్రభుత్వ చట్టంలో పొందుపరిచారు. ఈ సమావేశానికి కేవలం 46 మంది ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు.
భారత ప్రభుత్వ చట్టం 1935
బ్రిటిషర్లు రూపొందించిన రాజ్యాంగ సంస్కరణ చట్టాలన్నింటిలో ఇది వివరణాత్మకమైనది. సుదీర్ఘమైనది. 1937 ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉన్నాయి.
చట్టంలోని ముఖ్యాంశాలు
చట్టం ప్రాముఖ్యత
ఈ చట్టం ద్వారా పొందుపరిచిన అత్యంత ముఖ్యమైన అంశం ‘ప్రాంతాల స్వయం ప్రతిపత్తి’ దీని ద్వారా మొదటిసారిగా రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ప్రాంతీయ పాలనాంశాలన్నింటినీ మంత్రుల ఆధీనంలోకి బదిలీ చేశారు. కేంద్రం నియంత్రణ చాలా వరకు తగ్గింది. గవర్నర్లను రాష్ర్టాలకు రాజ్యాంగబద్దమైన అధిపతులుగా పరిగణించారు.
వాఖ్యానాలు
లిన్లిత్గో ఆగస్టు ప్రతిపాదనలు
భారత వైస్రాయ్ లార్డ్ లిన్ లిత్గో 1940 ఆగస్టు 8న కొన్ని ప్రతిపాదనలు చేశాడు.
ముఖ్యాంశాలు: