ధోనీ కుమార్తె జీవాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా తండ్రి మ్యాచ్లు ఆడే సమయంలో ఆమె పలికించే హావభావాలు ఎందరో మనసులను గెలుచుకుంటున్నాయి. ఇటీవల సన్రైజర్స్ మ్యాచ్లో ధోనీ సిక్సర్ ఫినిషర్కు ఆశ్చర్యపోయిన జీవా వీడియో గుర్తుంది కదా. దాని గురించి ఇంకా మర్చిపోక ముందే జీవాకు సంబంధించిన మరో ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఢిల్లీ, చెన్నై మ్యాచ్ సందర్భంగా తండ్రి జట్టు గెలుపు కోసం ప్రార్థిస్తున్నట్లుగా జీవా కనిపిస్తోంది.
కళ్లు మూసుకొని ఆమె ప్రార్థన చేస్తుండగా ఒక కెమెరా క్లిక్మంది. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్లో ధోనీ సేన ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేయలేకపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేశారు. లక్ష్యఛేదనలో కొంత తడబడినా ఢిల్లీ జట్టు విజయాన్ని అందుకుంది. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.