మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై జింబాబ్వే ఉత్కంఠ విజయం వివాదానికి దారితీసింది. స్వల్ప లక్ష్యఛేదనలో జింబాబ్వే బౌలింగ్ దాడికి పాక్ పరుగు తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో గతంలో ‘మిస్టర్ బీన్’ వ్యవహారంలో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ జింబాబ్వే అభిమాని మీపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ట్వీట్ చేశాడు. అందుకు తగ్గట్లే జింబాబ్వే సంచలన విజయం సొంతం చేసుకుంది.
అయితే దీనిపై తాజాగా ఇరు దేశాల అధినేతలు కూడా స్పందించారు. తొలుత జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ ఎమ్బాంగ్వా ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చారు. ‘జింబాబ్వేకు అద్భుతమైన విజయం. చెవ్రోన్స్కు అభినందనలు. మరోసారి అసలైన మిస్టర్ బీన్ను పంపండి’ అని ట్వీట్ చేశారు. దీనిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘మాకు నిజమైన మిస్టర్ బీన్ లేకపోయినా..మాలో నిజమైన క్రికెట్ స్ఫూర్తి దాగుంది. తిరిగి పుంజుకోవడం మా సరదా అలవాటు. మిస్టర్ ప్రెసిడెంట్ మీ జట్టు ఈ రోజు బాగా ఆడింది’ అని అన్నారు.