హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 2: రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ‘కుడా’ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ ప్రారంభించారు.
అండర్-18 స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మొత్తం 40 విభాగాల్లో 33 జిల్లాలకు చెందిన సుమారు 500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారు భోపాల్ వేదికగా జరుగనున్న జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.