హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర యువ టెన్నిస్ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి సత్తాచాటుతున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీలో కార్తీక్, మనీశ్ సురేశ్కుమార్ జోడీ సెమీస్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో కార్తీక్, సురేశ్ ద్వయం 7-6(8-6), 6-4తో ఇషాక్ ఇక్బాల్, ఫైజల్ కమర్ జోడీపై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తమదైన దూకుడు కనబరిచిన సాత్విక్..వరుస సెట్లలో ప్రత్యర్థి జోడీని ఓడించి ముందంజ వేసింది.