న్యూఢిల్లీ: యువ టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ అంతర్జాతీయ టోర్నీలో డబుల్ ధమాకా మోగించాడు. కరగండ వేదికగా జరిగిన ఐటీటీఎఫ్ కజకిస్థాన్ ఓపెన్ సింగిల్స్లో రజతం నెగ్గిన స్నేహిత్.. డబుల్స్లో కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 405వ ర్యాంకర్ స్నేహిత్ 1-4 (6-11, 9-11, 3-11, 11-9, 6-11)తో ప్రపంచ 46వ ర్యాంకర్ కిరిల్ గెరాసిమెన్కో (కజకిస్థాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. అంతకుముందు సెమీస్లో ఈ హైదరాబాదీ 4-1 (11-5, 11-3, 11-5, 6-11, 11-8)తో 136వ ర్యాంకర్ పావెల్ (బెలారస్)పై గెలిచాడు. డబుల్స్లో సుధాన్షు గ్రోవర్తో జోడీ కట్టిన స్నేహిత్ కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు.