న్యూఢిల్లీ: ఢిల్లీలోని శ్యామ్ప్రసాద్ ముఖర్జీ స్టేడియం వేదికగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో యువ స్విమ్మర్ సుహాస్ ప్రీతమ్ సత్తాచాటాడు. గురువారం జరిగిన బాలుర అండర్-17 100మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగంలో పోటీకి దిగిన సుహాస్ 00.59.24సెకన్ల టైమింగ్తో రజత పతకం సొంతం చేసుకున్నాడు.
ఇదే విభాగంలో రిషబ్ దాస్, అమన్ వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మరోవైపు బాలుర అండర్-17 400మీటర్ల విభాగంలో వర్షిత్ వెండి పతకం కైవసం చేసుకున్నాడు.