న్యూఢిల్లీ: యువ షూటర్ అనీశ్ భన్వాలా పుష్కర ఎదురుచూపులకు తెరదించాడు. ప్రపంచ వేదికపై 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో కాంస్యం గెలిచి 12 ఏళ్లుగా ఊరిస్తున్న పతకాన్ని అందించాడు. గురువారం ప్రపంచకప్ షూటింగ్ చాంపియన్షిప్లో 20 ఏళ్ల అనీశ్ ఈ విభాగంలో పతకం సాధించిన రెండో భారత షూటర్గా నిలిచాడు.
2012 లండన్ ఒలింపిక్స్లో విజయ్ కుమార్ రజతం సాధించిన తర్వాత భారత్కు మళ్లీ లభించిన పతకం ఇదే. ఈ విభాగంలో ఇటలీకి స్వర్ణం, ఫ్రాన్స్కు రజతం దక్కాయి.