న్యూఢిల్లీ: యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. భారత జట్టులో అందరికంటే ఫిట్గా ఉన్న ప్లేయర్గా నిరూపించుకున్నాడు. ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ప్రత్యేక శిబిరంలో పాల్గొంటుండగా.. ఆటగాళ్లకు ఫిట్నెస్ టెస్టులు నిర్వహించారు.
భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే యో-యో టెస్టు లో 16.5 పాయింట్లు సాధించడం తప్పనిసరి కాగా.. తనకు 17.2 పాయింట్లు వచ్చాయని ఇప్పటికే కోహ్లీ వెల్లడించాడు. తాజాగా ఇతర ఆటగాళ్లకు కూడా యోయో టెస్టు నిర్వహించగా.. జట్టులో అందరికంటే ఎక్కువగా శుభ్మన్ గిల్కు 18.7 పాయింట్లు వచ్చాయని బోర్డు అధికారి తెలిపారు.