ఒర్లీన్స్: ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో భారత యువ షట్లర్ తన్విశర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో తన్వి 21-14, 21-14తో ఆరో సీడ్ నత్సుకి నిదైరా(జపాన్)పై అద్భుత విజయం సాధించింది. 43 నిమిషాల్లోనే ముగిసిన పోరులో తన్వి వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి ముందంజ వేసింది.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన తన్వి..మెరుపు స్మాష్లకు తోడు డ్రాప్ షాట్లు, నెట్గేమ్తో జపాన్ షట్లర్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. సెమీస్లో జపాన్ స్టార్ షట్లర్ నజొమి ఒకుహరతో తన్వి అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు ఎమ్ఆర్ అర్జున్, హరిహరణ్ ద్వయం ప్రత్యర్థి చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.