బ్యాంకాంక్: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ థాయ్లాండ్ ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో లక్ష్యసేన్ 21-19, 21-11తో లియాంగ్ జున్ హో (మలేసియా)పై విజయం సాధించాడు.
ఈ సీజన్లో లక్ష్యసేన్కు ఇదే తొలి సెమీఫైనల్ కావడం గమనార్హం. మరో భారత షట్లర్ కిరణ్ జార్జ్ క్వార్టర్స్లో 16-21, 17-21తో జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు.