బ్యాంకాక్: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ థాయ్లాండ్ ఓపెన్ సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ సెమీస్లో శనివారం లక్ష్య 21-13, 17-21, 13-21తో రెండో సీడ్ కునావత్ వితిద్సరన్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
ఈ సీజన్లో తొలి సారి సెమీస్ వరకు వచ్చిన లక్ష్య.. కునావత్తో పోరులో తుదివరకు పోరాడాడు. 75 నిమిషాల పాటు సాగిన పోరులో ఒక్కో పాయింట్ కోసం ఇరువురు ఆటగాళ్లు భీకరంగా పోరాడారు.