బెంగళూరు: పంచ్లకు తట్టుకోలేక ఓ యువ బాక్సర్ తనువు చాలించాడు. జ్ఞానజ్యోతి నగర్లో ఈనెల 10న నిర్వహించిన ‘కే1 కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్’లో నిఖిల్ బరిలోకి దిగాడు.
ప్రత్యర్థి బాక్సర్ సంధించిన పంచ్లకు నిఖిల్ రింగ్లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు దవాఖానకు తరలించారు. తలకు బలంగా గాయాలు కావడంతో రెండు రోజులు కోమాలో ఉన్న 23 ఏండ్ల నిఖిల్ ఈ నెల 12న మృతి చెందాడు.