బ్యాంకాక్: థాయ్లాండ్లో జరిగిన వరల్డ్ బాకింగ్స్ ఫ్యూచర్స్ కప్-2026లో యువ బాక్సర్ చంద్రిక పుజారి స్వర్ణంతో మెరిసింది. మహిళల 51 కిలోల ఫైనల్లో చంద్రిక.. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ మర్డొనొవ నజొకత్ను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ స్వర్ణంతో పాటు మూడు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తంగా ఐదు పతకాలు సాధించింది.
గుంజన్ (48 కి.), జయశ్రీ (54 కి.), అంబేకర్ (50 కి.) రజతాలు గెలిచారు. రాధామణి (57 కి.) కాంస్యం నెగ్గింది.