న్యూఢిల్లీ: యువ అథ్లెట్ పారుల్ చౌదరీ నయా జాతీయ రికార్డు నెలకొల్పింది. లాస్ఏంజిల్స్ వేదికగా జరుగుతున్న రన్నింగ్ మీట్ 3 వేల మీటర్ల పరుగులో పారుల్ 8 నిమిషాల 57.19 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. తద్వారా ఆరేండ్ల క్రితం స్యూర్య లోకనాథన్ నెలకొల్పిన జాతీయ రికార్డు (9 నిమిషాల 4.5 సెకన్లు)ను బద్దలు కొట్టింది. అలాగే దేశం తొమ్మిది నిమిషాల లోపు ఈ రేసును పూర్తి చేసిన తొలి భారత మహిళగా నిలిచింది. తాజా టోర్నీలో 27 ఏండ్ల పారుల్.. మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజిక్కించుకుంది.