హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ అథ్లెట్ జివాంజి దీప్తి చరిత్ర లిఖించింది. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ప్రి టీ20 బాలికల 400 మీటర్ల విభాగంలో దీప్తి విజేతగా నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్గా రికార్డుల్లోకెక్కింది. మొరాకో వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో వరంగల్కు చేందిన దీప్తి.. 57.66 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఫెలిక్స్ బార్బొసా (59.28 సె.), ఆష్లే తెల్వావే (1:07.84 సె.) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.