యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 100; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ఆసియా క్రీడల్లో భారత జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో యువ భారత్ 23 పరుగుల తేడాతో నేపాల్ను చిత్తుచేసింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత జట్టు.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
యశస్వి ఆరంభం నుంచే దంచికొట్టగా.. రుతురాజ్ (25), శివమ్ దూబే (25 నాటౌట్) పర్వాలేదనిపించారు. చివర్లో సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ (15 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులకు పరిమితమైంది. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.