న్యూయార్క్: చైనాలో జరగాల్సిన అన్ని టోర్నీలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు మహిళల టెన్నిస్ సంఘం ప్రకటించింది. ఆ దేశ క్రీడాకారిణి పెంగ్ షూయి అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూటీఏ ఈ నిర్ణయం తీసుకున్నది. చైనా అధికారిపై లేంగిక వేధింపుల ఆరోపణలు చేసిన పెంగ్ గత మూడు వారాల నుంచి ఆచూకీలేదు. ఈ నేపథ్యంలో మహిళ టెన్నిస్ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 35 ఏళ్ల చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ సురక్షితంగా ఉందన్న విషయంలో అనుమానాలు ఉన్నట్లు డబ్ల్యూటీఏ చీఫ్ స్టీవ్ సైమన్ తెలిపారు. ఇలాంటి తరుణంలో అథ్లెట్లను ఆ దేశంలో ఆడాలని ఎలా సూచించగలమని ఆయన అన్నారు. అయితే క్రీడల పేరుతో సాగుతున్న రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చైనా పేర్కొన్నది.