టీమ్ఇండియా సీనియర్ వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహాకు గాయాల బెడద వీడటం లేదు. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో మెడనొప్పి కారణంగా మూడో రోజు ఆటకు సాహా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ‘సాహా గాయాన్ని వైద్య బృందం పరిశీలిస్తున్నది. సాహా స్థానంలో కేఎస్ భరత్ వికెట్కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు’ అని తెలిపింది. రెగ్యులర్ వికెట్కీపర్ రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన 37 ఏండ్ల సాహా తొలి ఇన్నింగ్స్లో ఒక పరుగు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. సాహాకు బదులుగా కీపింగ్ చేసిన భరత్ రెండు క్యాచ్లు, ఒక స్టంపౌట్ చేసి ఆకట్టుకున్నాడు.