WPL Auction : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)వేలంలో ఆల్రౌండర్లు, హిట్టర్లు భారీ ధర పలికారు. బీసీసీఐ తొలిసారిగా నిర్వహిస్తున్న డబ్ల్యూపీఎల్ వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. అత్యంత ఖరీదైన ప్లేయర్గా నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.40 కోట్ల భారీ ధరకు ఈ స్టార్ క్రికెటర్ను కొనుగోలు చేసింది.
ముంబైలో జరుగుతున్న ఈ వేలంలో ఆరుగురు భారత క్రికెటర్లు భారీ ధర పలికారు. దీప్తి శర్మ అత్యధిక ధర దక్కించుకున్న రెండో ఇండియన్ క్రికెటర్గా రికార్డు సాధించింది. టాప్ 10లో ఉన్న ప్లేయర్స్ ఎవరంటే..?
1. స్మృతి మంధాన (భారత్) – రూ.3.40 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2. అష్లీ గార్డ్నర్ (ఆస్ట్రేలియా) – రూ. 3.20 కోట్లు – గుజరాత్ జెయింట్స్
3. సీవర్ నటాలియె (ఇంగ్లండ్) – రూ. 3.20 కోట్లు – ముంబై ఇండియన్స్
4. దీప్తి శర్మ (భారత్) – రూ.2.60 కోట్లు – యూపీ వారియర్స్
5. జెమీమా రోడ్రిగ్స్ (భారత్) – రూ. 2.20 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
6. షఫాలీ వర్మ (భారత్) – రూ.2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
7. బేత్ మూనీ (ఆస్ట్రేలియా) – రూ.2 కోట్లు – గుజరాత్ జెయింట్స్
8. రీచా ఘోష్ (భారత్) – రూ.1.9 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
9. హర్మన్ప్రీత్ కౌర్ (భారత్) – రూ.1.8 కోట్లు – ముంబై ఇండియన్స్
10. సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్) – రూ.1.8 కోట్లు- యూపీ వారియర్స్