WPL 2024, UP vs MI | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచేందుకు కీలక మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్లు ఆడిన ముంబై.. నేడు ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. యూపీ బౌలింగ్ చేయనుంది.
ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడి మూడు గెలిచి రెండింట్లో ఓడిన ముంబై.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 8 పాయింట్లతో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ ఆరు మ్యాచ్లలో మూడు గెలిచి మూడింట ఓడి ఆరు పాయింట్లతో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. ముంబై, బెంగళూరు తలా ఆరు పాయింట్లతో సమానంగా ఉన్నా నెట్ రన్ రేట్ విషయంలో బెంగళూరు (+0.038).. ముంబై (+0.018) కంటే మెరుగ్గా ఉంది. నేటి మ్యాచ్లో ముంబై.. యూపీని ఓడిస్తే ఆర్సీబీని వెనక్కినెట్టి రెండో స్థానానికి వచ్చే అవకాశాలున్నాయి.
మరోవైపు ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడి రెండు మాత్రమే గెలిచిన యూపీ వారియర్స్.. నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే యూపీకి ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ముంబైని ఓడిస్తే యూపీ థర్డ్ ప్లేస్కు వెళ్లే ఛాన్స్ ఉంది. ముంబై, యూపీలు గత మ్యాచ్లో ఓడిపోయాయి. లీగ్ దశ చివరి దశకు చేరుకుంటున్న క్రమంలో ఇకనుంచి జట్లన్నీ తాము ఆడబోయే ప్రతి మ్యాచ్లోనూ గెలిచేందుకు యత్నిస్తున్న తరుణంలో నేటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి…