Nishant Dev | బస్టో అర్సిజియో(ఇటలీ): వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫయర్ టోర్నీలో భారత యువ బాక్సర్ నిశాంత్దేవ్..ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల 71కిలోల బౌట్లో నిశాంత్ 5-0తో మెడియన్ ఎస్కర్టన్(ఇటలీ)ను మట్టికరిపించాడు. మరోవైపు పురుషుల 92 కిలోల బౌట్లో సంజీత్ 0-5తో ఐబెక్(కజకిస్థాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు. మహిళల 66కిలోల విభాగం తొలి రౌండ్లో అంకుషిత బొరో 2-3తో సాన్వికో ఎమిలె (ఫ్రాన్స్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.