ఉఫా (రష్యా): ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ టోర్నీలో భారత రెజ్లర్లు అదరగొట్టారు. బుధవారం జరిగిన 61 కిలో ల విభాగం ఫైనల్లో రవిందర్ రజతం సాధించగా.. యశ్ (74 కిలోలు), పృథ్వి బాబాసాహెబ్ పాటిల్ (92 కిలోలు), అనిరుధ్ (125 కిలోలు) కాంస్యాలు నెగ్గారు. రవిందర్ 3-9 తేడాతో రహ్మాన్ మౌసా (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. మహిళల విభాగంలో బిపాషా ఫైనల్కు చేరింది.