కొపెన్హగెన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-15, 19-21, 21-9తో ఇండోనేషియా జోడీ లియో రాలీ కార్నడో, డానియల్ మార్టిన్పై అద్భుత విజయం సాధించింది.
గంట పాటు సాగిన పోరులో తొలి గేమ్ను అలవోకగా కైవసం చేసుకుంది. ఇండోనేషియా జంటకు ఎలాంటి అవకాశమివ్వకుండా మూడో గేమ్ను అలవోకగా దక్కించుకోవడంతో పాటు మ్యాచ్ను తమ ఖాతాలో వేసుకుంది.