న్యూఢిల్లీ: ఇన్ని రోజులు ఉప్పునిప్పులా ఉన్న భారత స్టార్ బాక్సర్లు మేరీకోమ్, నిఖత్ జరీన్ ఒక్కటయ్యారు. సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకున్న వీరు ఆత్మీయతను పంచుకున్నారు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకం సాధించిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ను మేరీకోమ్ ప్రత్యేకంగా అభినందించింది. మేరితో కలిసి దిగిన ఫొటోను జరీన్ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ‘దిగ్గజ బాక్సర్ ఆశ్వీరాదం లేకుండా విజయం పరిపూర్ణం కాదు’ అంటూ ట్వీట్ చేసింది. కొద్దిసేపటికే ట్వీట్ వైరల్గా మారింది. కొన్ని గంటల వ్యవధిలో లైక్లు, కామెంట్లు వెలువెత్తాయి. మేరికోమ్, నిఖత్ కలిసిపోవడం బాక్సింగ్ అభిమానులకు మంచి కిక్కు ఇచ్చింది.