న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్కు భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్బాబు మరోసారి ఝలక్ ఇచ్చాడు. చెస్సబుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో పదహారేండ్ల చెన్నై కుర్రాడు.. నార్వే చెస్ దిగ్గజం కార్ల్సన్ను ఓడించాడు.
శనివారం వీరిద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన ఐదో రౌండ్ ‘డ్రా’ దిశగా సాగుతున్న క్రమంలో కార్ల్సన్ ఓ తప్పిదం చేయగా.. దాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజ్ఞానంద తన ఎత్తుగడతో నార్వే దిగ్గజాన్ని ఓడించాడు. 12 పాయింట్లు ఖాతాలో వేసుకున్న మనోడు ఐదో స్థానానికి ఎగబాకి నాకౌట్ రేసులో నిలువగా.. కార్ల్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్థింగ్స్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో తొలిసారి కార్ల్సన్ను ఓడించి ప్రజ్ఞానంద సంచలనం రేపాడు.