సిఫారసు చేసిన కమిటీ
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పేరును ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ప్రతిపాదించారు. వివిధ క్రీడాంశాల్లో నిలకడగా రాణిస్తున్న 25 telaమంది అథ్లెట్ల జాబితాను 12 మంది సభ్యులతో కూడిన కమిటీ శనివారం కేంద్రప్రభుత్వానికి అందించింది. ఇందులో రాష్ట్రం నుంచి నిఖత్ జరీన్తో పాటు టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ ఆకుల శ్రీజ చోటు దక్కించుకుంది. ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన నిఖత్.. ఇటీవల బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకం నెగ్గి సత్తాచాటిన విషయం తెలిసిందే. దేశంలో అత్యున్న తక్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న కోసం 42 మంది ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా.. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో రాణిస్తున్న శరత్ కమల్ పేరును కమిటీ సిఫారసు చేసింది.