బుడాపెస్ట్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ జెస్విన్ అల్డ్రిన్ లాంగ్జంప్లో ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల లాంగ్జంప్లో జెస్విన్ 8.0మీటర్ల దూరం లంఘించి దూకాడు.
ఈ సీజన్లో తన మెరుగైన ప్రదర్శన(8.42మీ) అందుకోలేకపోయిన జెస్విన్..ఓవరాల్గా 12వ స్థానంతో ఫైనల్ పోరుకు అర్హత సాధించాడు. మరోవైపు అల్డ్రిన్తో కలిసి బరిలోకి దిగిన మురళీ శ్రీశంకర్ అర్హత రౌండ్లోనే పోరాటాన్ని ముగించి నిరాశపరిచాడు. జావెలిన్త్రోలో అన్నురాణి అర్హత రౌండ్లోనే ఔట్ అయ్యింది.