న్యూఢిల్లీ: 2023 మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో మరో భారత బాక్సర్ బూర సవీటి తన పంచ్ పవర్ చూపించింది. మహిళల 81 కిలోల విభాగం ఫైనల్లో సవీటి.. చైనా బాక్సర్ వాంగ్ లినాపై 4-3 తేడాతో విజయం సాధించింది. అయితే, ఫైనల్లో ఇద్దరి మధ్య హోరాహోరి పోరు జరిగింది. ఆఖరికి స్వల్ప తేడాతో సవీటి గెలుపొంది గోల్డ్ మెడల్ను సొంతం చేసుకుంది.
2023 మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఇది రెండో గోల్డ్ మెడల్. ఇవాళ సాయంత్రం 48 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ నీతూ గంగాస్ మంగోలియన్ బాక్సర్ను 5-0 తేడాతో మట్టి కరిపించి బంగారు పతకాన్ని ముద్దాడింది. రేపు తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్తో ఫైనల్ పోరు ఉంది. నిఖత్ కూడా పసిడి పట్టుపడితే ఈ బాక్సింగ్ చాంపియన్షిప్ భారత్కు వచ్చిన గోల్డ్ మెడల్స్ సంఖ్య మూడుకు చేరుతుంది.