హైదరాబాద్, నమస్తే తెలంగాణ: థాయ్లాండ్లో జరిగిన మహిళల అండర్-18 ఆసియా వాలీబాల్ చాంపియన్షిప్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన శాంతకుమారిని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం అభినందించారు. బాలానగర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటూ జాతీయ జట్టుకు ఆడటం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే ప్లేయర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉంటారని అన్నారు. రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన శాంతకుమారికి రూ.లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేసేందుకు ప్రభుత్వం నెలకొల్పిన గురుకులాలు ఎంతో తోడ్పడుతున్నాయని ఈ సందర్భంగా ఆమె అన్నారు.