ఇండియన్వెల్స్ : బిఎన్పి పారిబస్ టెన్నిస్ టోర్నీలో మహిళల టాప్ర్యాంకర్ ఇగా స్వియాటెక్ నాలుగో రౌండ్కు చేరుకుంది. స్వియాటెక్ మూడో రౌండ్లో 2019 విజేత బియాంక ఆండ్రెస్క్యూపై 6-3, 7-6(7-1)తో గెలుపొందింది. కాగా నాలుగో ర్యాంకర్ ఓన్స్ జేబర్ 6-7(5-7), 4-6తో మార్కెట ఒండ్రుసోవా చేతిలో ఓడిపోయింది. అయిదో ర్యాంకర్ కరోలిన్ గార్సియా 6-4, 6-7(5-7), 6-1తో లీలా ఫెర్నాండెజ్ను ఓడించింది. మరో మ్యాచ్లో 2021 యుఎస్ ఓపెన్ విజేత ఎమ్మా రదుకాను 6-1, 2-6, 6-4తో బీట్రిజ్ హదద్ మియాపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో నిరుటి విజేత టేలర్ ఫ్రిట్జ్ 6-1, 6-2తో సెబాస్టియన్ బాజ్ను సునాయాసంగా ఓడించాడు. జాక్ డ్రేపర్ 7-6(8-6), 6-2తో ఆండీ ముర్రే ఆశలకు గండికొట్టాడు. .