Womens T20 WC : సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. 6 వికెట్ల నష్టానికి 155 రన్స్ కొట్టింది. ఓపెనర్ స్మృతి మంధాన అర్ధ శతకం (87)తో చెలరేగింది. చివర్లలో జెమీమా రోడ్రిగ్స్ (19) మెరుపులు మెరిపించింది. ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు బాదింది. షఫాలీ వర్మ(24), హర్మన్ప్రీత్ కౌర్ (13) విఫలం అయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో డెలానీ మూడు వికెట్లు, ఒర్లా ప్రెండెర్గాస్ట్ రెండు వికెట్లు తీశారు.
కీలకమైన మ్యాచ్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీ సాధించింది. కారా ముర్రే ఓవర్లో సిక్సర్తో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 40 బంతుత్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో మంధాన అర్థ శతకం బాదింది. ఈ ప్రపంచకప్లో మంధానకు ఇది రెండో ఫిఫ్టీ. ఫోర్లు, సిక్సర్లతో ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడిన మంధాన. నాలుగో వికెట్కు జెమీమా రోడ్రిగ్స్తో 28 రన్స్ జోడించింది. అంతకుముందు షఫాలీ వర్మ, హర్మన్ప్రీత్ కౌర్తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. రెండో వికెట్కు హర్మన్ప్రీత్ కౌర్, మంధాన 50 రన్స్ జోడించారు. మొదటి వికెట్కు షఫాలీ వర్మతో 62 పరుగులు జోడించింది.
ఐర్లాండ్ బౌలర్ డెలానీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్ను దెబ్బ కొట్టింది. 16వ ఓవర్ ఐదో బంతికి హర్మన్ప్రీత్ కౌర్, ఆరో బంతికి రీచా ఘోష్ను ఔట్ చేసింది. దాంతో 115 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. జెమీమా రోడ్రిగ్స్, మంధానతో జత కలిసింది. వీళ్లిద్దరూ ఫోర్లు కొడుతూ స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. అయితే.. ధాటిగా ఆడే క్రమంలో ఒర్లా ప్రెండెర్గాస్ట్ బౌలింగ్లో మంధాన ఔట్ అయింది. ఆ తర్వాతి బంతికే దీప్తి శర్మ షాట్కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకుంది.