బెంగళూరు: భారత సీనియర్ హాకీ ప్లేయర్ రాణిరాంపాల్కు మరోమారు చుక్కెదురైంది. చైనా వేదికగా సెప్టెంబర్లో జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్కు హాకీ ఇండియా(హెచ్ఐ) శనివారం 34 మందితో ప్రాబబుల్స్ను ఎంపిక చేసింది. అయితే ఈ జాబితాలో రాణికి చోటు దక్కలేదు. జాతీయ జట్టులో తన చోటుపై చీఫ్ కోచ్ను నిలదీసిన రాణిని హాకీ ఇండియా జూనియర్ జట్టుకు కోచ్గా నియమించిన కొద్ది రోజుల తేడాతో ఇది చోటు చేసుకుంది.