ఎల్బీనగర్, జూలై 22 : ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని, పోలీస్ విభాగంలో 5వేలు కాదు, 19 వేల పోస్టులతో నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈ నెల 24న తెలంగాణ బంద్కు పిలుపు ఇస్తున్నామని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఇంద్రానాయక్ తెలిపారు. దిల్సుఖ్నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం ఐదు వేల ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించదని, వెంటనే 19 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలను నెరవేర్చేలా పారదర్శకంగా నియామక పక్రియ చేపట్టాలని కోరారు. డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం తెలంగాణ బంద్కు పిలుపు ఇస్తున్నామని పేర్కొన్నారు. బంద్కు నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, ప్రజలు సంపూర్ణమద్దతు తెలుపాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సోమేశ్జాదవ్, వినయ్, గణేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.