మీర్పూర్: మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరుగనున్న తొలి టీ20లో బంగ్లాదేశ్తో భారత మహిళల జట్టు తలపడనుంది. యువ ప్లేయర్లతో నిండి ఉన్న భారత జట్టు పొట్టి ఫార్మాట్లో సత్తాచాటాలని చూస్తున్నది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తున్న ఈ జట్టులో తెలుగమ్మాయిలు సబ్బినేని మేఘన, అంజలి, అనూష చోటు దక్కించుకున్నారు. స్టార్ బ్యాటర్లు మందన, షఫాలీ, రోడ్రిగ్స్, సమిష్టిగా సత్తాచాటితే ఈ మ్యాచ్లో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు.