WIvsENG: వెస్టిండీస్ – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ సంచలనాలకు వేదికవుతోంది. ఈ సిరీస్ ఆరంభ మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారిగా టీ20 ఫార్మాట్లో ‘స్టాప్ క్లాక్’ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్లో వెస్టిండీస్ అంపైర్ జాక్వలిన్ విలియమ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండో టీ20కి ఆమె ఫీల్డ్ అంపైర్గా విధులు నిర్వర్తించింది. దీంతో వెస్టిండీస్ నుంచి ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన తొలి అంపైర్గా చరిత్ర సృష్టించింది.
కరేబియన్ దీవుల లోని జమైకాకు చెందిన జాక్వలిన్.. ఐసీసీ ఫుల్మెంబర్స్ నేషన్స్కు అంపైర్గా వ్యవహరించడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్లో న్యూజిలాండ్కు చెందిన కిమ్ గార్టన్.. తొలిసారి ఒక టీ20 మ్యాచ్లో అంపైర్గా విధులు నిర్వర్తించి రికార్డు సృష్టించింది. 2023లో ఆమె.. న్యూజిలాండ్ – శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్కు ఆన్ఫీల్డ్ అంపైర్గా బాధ్యతలు నిర్వర్తించింది. తాజాగా జాక్వలిన్ కూడా ఆమె సరసన చేరింది. పురుషుల క్రికెట్లో భాగంగా వన్డే ఫార్మాట్లో క్లారి పొలొసక్, ఎలొసి షెరిడాన్లు 2018లో నమీబియా – ఓమన్ మధ్య జరిగిన మ్యాచ్లో అంపైర్లుగా వ్యవహరించారు.
Jacqueline Williams creates HISTORY!#CricketTwitter pic.twitter.com/U9OuJt6gqu
— Female Cricket (@imfemalecricket) December 14, 2023
గ్రెనెడా వేదికగా వెస్టిండీస్ -ఇంగ్లండ్ మధ్య గురువారం ముగిసిన రెండో టీ20లో విండీస్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. దీంతో విండీస్ పది పరుగుల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది.