లండన్: ప్రపంచ నంబర్వన్ ఆష్లే బార్టీ తొలిసారి వింబుల్డన్ ఫైనల్లో అడుగుపెట్టింది. గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్కు దూరమైన బార్టీ.. నాలుగు దశాబ్దాల తర్వాత గ్రాస్ కోర్టు ఫైనల్కు చేరిన ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కింది. గురువారం మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో బార్టీ 6-3, 7-6 (7/3)తో కెర్బర్ (జర్మనీ)పై విజయం సాధించింది. తొలి సెట్ను సునాయాసంగా చేజిక్కించుకున్న బార్టీ.. రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైనా కీలక సమయాల్లో పాయింట్లతో ఫైనల్కు చేరింది. మరో సెమీస్లో కరోలినా ప్లిస్కోవా 5-7, 6-4, 6-4తో సబలెంకపై గెలిచి తొలిసారి గ్రాండ్స్లామ్ తుదిపోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరుగనున్న పురుషుల సింగిల్స్ సెమీస్లో షపలోవ్తో జొకోవిచ్.. హుర్కాజ్తో బెరెట్టిని తలపడనున్నారు.