లండన్ : ఈ ఏడాది వింబుల్డన్ పారితోషికాన్ని 11.2 శాతం పెంచుతూ మొత్తంగా 44.7 మిలియన్ పౌండ్లను విజేతలకు అందజేయనున్నారు. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు 2.35 మిలియన్ పౌండ్లను దక్కించుకోనున్నారు.
తొలి రౌండ్లో ఓడిన ఆటగాడికి సైతం 55వేల పౌండ్లు దక్కనున్నాయి. ఇది గత ఏడాదికంటె పది శాతం ఎక్కువ.