దుబాయ్: ఇండియన్ టీమ్ ( Team India ) కోచ్ పదవి టీ20 వరల్డ్కప్తో ఖాళీ అవుతోంది. ఈ మెగా టోర్నీతో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తోంది. తాను పొడిగింపు కోరనని శాస్త్రి స్పష్టం చేశాడు. దీంతో ఇప్పటికే శ్రీలంక టూర్లో టీమిండియాకు కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడే తర్వాత హెడ్ కోచ్ కావడం ఖాయమన్న వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అతడు నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రెసిడెంట్ కావడంతో ఆ వార్తలకు తెరపడింది.
కానీ తాజాగా ఈ అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ద టెలిగ్రాఫ్తో మాట్లాడిన ఆయన.. టీమిండియా కోచ్ పదవిపై తన అభిప్రాయాన్ని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన ఈ పదవి తీసుకోవడానికి ద్రవిడ్ ఆసక్తి చూపడం లేదన్న విషయం నాకు తెలుసు. అయితే దీని గురించి అతన్ని మేము ప్రత్యేకంగా అడగలేదు. ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాం అని గంగూలీ అన్నారు.
ఇక టీ20 వరల్డ్కప్కు ధోనీని మెంటార్గా పంపించడంపైనా దాదా స్పందించారు. ఈ ఆలోచన ఎవరిది అని ప్రశ్నించగా.. అది ఎవరిది అన్నదాంతో సంబంధం లేదు. ఇండియన్ టీమ్ విజయవంతం కావడమే ముఖ్యం. అంతేకాదు అతడు కేవలం టీ20 వరల్డ్కప్కు మాత్రమే మెంటార్గా ఉంటాడు. తర్వాత ఉండబోనని ధోనీ మాకు తేల్చి చెప్పాడు అని కూడా గంగూలీ వెల్లడించారు.