ఫ్లోరిడాలో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్కు మంచి సహకారం అందించిన దీపక్ హుడా (38) పెవిలియన్ చేరాడు. లెగ్ స్టంప్ ఆవలగా వాల్ష్ వేసిన బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాదేందుకు హుడా ప్రయత్నించాడు. కానీ టైమింగ్ మిస్సవడంతో అది అనుకున్నంత దూరం వెళ్లలేదు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న షామ్రా బ్రూక్స్ పరిగెత్తుకుంటూ వచ్చి చక్కని క్యాచ్ అందుకోవడంతో హుడా మైదానం వీడాడు. దీంతో 12 ఓవర్లకు భారత జట్టు 116/2 స్కోరుతో నిలిచింది.