భారత్తో జరుగుతున్న ఐదో టీ20లో విండీస్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విండీస్ కూడా ప్రయోగాత్మకంగా జేసన్ హోల్డర్ (0)ను ఓపెనర్గా పంపింది. అయితే ఈ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
అక్షర్ పటేల్ వేసిన తొలి ఓవర్లోనే హోల్డర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అక్షర్ వేసిన బంతి లైన్ను పూర్తిగా మిస్ అవడంతో అది వికెట్లను కూల్చింది. దీంతో జట్టు స్కోరు బోర్డు ఖాతా తెరవకముందే హోల్డర్ మైదానం వీడాడు. ఆ ఓవర్లో అక్షర్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.
.@Jaseholder98 bowled out! Spectacular delivery from @akshar2026.
Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/c3jN00LifR
— FanCode (@FanCode) August 7, 2022