ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్లో ఆడబోయే భారత జట్టును బీసీసీఐ సోమవారం రాత్రి ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న ఈ జట్టుకు కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అయితే 15 మందితో కూడిన ఈ జట్టులో వికెట్ కీపర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్ పేరు లేకపోవడంపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జట్టు ప్రకటన తర్వాత ట్విటర్ వేదికగా పలువురు అభిమానులు బీసీసీఐ తీరుపై మండిపడ్డారు. బీసీసీఐ కావాలనే శాంసన్ను అణిచివేస్తుందని ఆరోపించారు. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ కంటే శాంసన్ మెరుగైన ఆటగాడని వ్యాఖ్యానించారు. ఆ మేరకు గణాంకాలను వెల్లడిస్తూ సెలక్టర్ల తీరుపై ఫైర్ అయ్యారు.
కెఎల్ రాహుల్ రాకతో ఓపెనింగ్ జోడీ (రోహిత్ శర్మ-రాహుల్)కి అవసరం లేకపోవడంతో ఇషాన్ కిషన్ను పక్కనబెట్టారు సెలక్టర్లు. వన్ డౌన్లో కోహ్లీ బ్యాటింగ్కు వస్తాడు. మిడిలార్డర్ కోసం సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్లు ఉన్నారు. దీంతో శ్రేయాస్ అయ్యర్ను బ్యాకప్గా ఎంపిక చేశారు. నలుగురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లకు అవకాశమిచ్చారు. అయితే కనీసం బ్యాకప్ ప్లేయర్గా అయినా శాంసన్ పనికిరాడా..? అంటూ అతడి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Performance of Wicketkeepers in T20is in 2022
SANJU-158.40 SR& 44.75 AVG
ISHAN-130.30 SR& 30.71 AVG
PANT-135.42 SR& 26 AVG
DK-133.33 SR& 21.33 AVGBest performers- Sanju Samson and Ishan Kishan.
Picked in Asia Cup- Pant and DKDoes that make sense?#AsiaCup2022 #Sanjusamson pic.twitter.com/hCgIxOKmd2
— Anurag (@RightGaps) August 8, 2022
Not a fan Sanju Samson but he should have been playing instead of Hooda. https://t.co/M0vLGxNnfa
— °• Chenae •° (@chenae876) August 8, 2022