Virat Kohli : భారత జట్టు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) కొత్త బిజినెస్లోకి అడుగుపెట్టాడు. ఫుడ్ లవర్ అయిన అతను నెదర్లాండ్స్లోని అమ్స్టర్డామ్లో తన పేరుతో ‘రైనా ఇండియన్ రెస్టారెంట్'(Raina Indian Restaurant) తెరిచాడు. అక్కడివాళ్లకు భారతీయ వంటకాలను రుచి చూపబోతున్నాడు. రెస్టారెంట్ వ్యాపారంలోకి వచ్చిన రైనాకు విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో అభినందనలు తెలిపాడు.
‘వెల్ డన్ బ్రో.. కంగ్రాట్యులేషన్స్. మేము అమ్స్టర్డామ్ వచ్చినప్పుడు కచ్చితంగా నీ రెస్టారెంట్ను విజిట్ చేస్తాం’ అని అతడికి మాటిచ్చాడు. మీకు తెలుసా..? కోహ్లీ కూడా రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నాడు. ఢిల్లీలో అతడికి ‘వన్ 9 కమ్యూనే’ పేరుతో పెద్ద హోటల్ ఉంది.
‘ఉత్తరాది ఘాటైన వంటకాల నుంచి దక్షిణాది నోరూరించే కూరల వరకు అన్నీ లభిస్తాయి. రైనా ఇండియన్ రెస్టారెంట్ అనేది వైవిధ్యమైన, భిన్న వంటకాలకు నిలయమైన నా దేశానికి నిలువుటద్దం లాంటిది’ అని ఈ మాజీ క్రికెటర్ తన ఇన్స్టా పోస్ట్లో వర్ణించాడు. టీమిండియా గొప్ప విజయాల్లో భాగమైన రైనా ఆ తర్వాత ఐపీఎల్లో అదరగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2021లో ఐపీఎల్కు వీడ్కోలు పలికిన రైనా త్వరలో లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier League)లో ఆడనున్నాడు. వేలంలో పేరు నమోదు చేసుకున్న ఏకైక భారత క్రికెటర్గా అతను గుర్తింపు సాధించాడు.