న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఇప్పటివరకు మొత్తం 15 సీజన్లు పూర్తయ్యాయి. పదిహేను ఫైనల్స్ జరిగాయి. ఇవాళ హర్దిక్ పాండ్యా (Hardik Pandya) నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ (GT), మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల జరుగుతున్న 16వ ఫైనల్ మ్యాచ్తో ఐపీఎల్ 16వ సీజన్ కూడా ముగిసిపోనుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఎవరి పేరిట ఉందనే ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తింది. దాంతో గణాంకాలను పరిశీలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ పేరిట ఆ రికార్డు ఉన్నది. షేన్ వాట్సన్ 2018 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 57 బంతుల్లో 117 పరుగులు రాబట్టి నాటౌట్గా నిలిచాడు. ఇదే ఇప్పటివరకు ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉన్నది.
ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2014 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన వృద్ధిమాన్ సాహా కోల్కతా నైట్ రైడర్స్ టీమ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 55 బంతుల్లో 115 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వృద్ధిమాన్ సాహా తర్వాత మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో మురళీ విజయ్ మూడో స్థానంలో ఉన్నాడు. 2011 ఐపీఎల్ ఫైనల్లో CSK తరఫున RCBపై మురళీ విజయ్ 52 బంతుల్లో 95 పరుగులు చేశాడు.