Westt Indies : ఈమధ్య కాలంలో అన్న ఫార్మాట్లలో ఘోరంగా విఫలమవుతున్న వెస్టిండీస్ (Westt Indies) జట్టు వన్డేల్లో కొత్త అధ్యాయం లిఖించింది. అలాఅనీ అద్భుత విజయంతోనే, సంచలన ఆటతోనే కాదు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో వన్డేలో బౌలింగ్ ప్రదర్శనతో కరీబియన్ టీమ్ వార్తల్లో నిలిచింది. అదెలాగంటే.. మొత్తానికి మొత్తం ఓవర్లను స్పిన్నర్లే వేశారు. దాంతో.. 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. గతంలో శ్రీలంక పేరిట ఉన్న రికార్డును విండీస్ బద్ధలు కొట్టింది.
ఇదివరకూ వన్డేల్లో లంక మూడు పర్యాయాలు స్పిన్నర్లతో అత్యధికంగా 44 ఓవర్లు వేయించింది. 1966లో వెస్టిండీస్పై, 1998లో న్యూజిలాండ్పై, ఆస్ట్రేలియాపై 2004లో శ్రీలంక స్పిన్నర్లు కలిసి 44 ఓవర్లు బౌలింగ్ చేశారు. ఈ మూడు సందర్భాల్లోనూ ఆ జట్టు పేసర్లు కేవలం ఆరు ఓవర్లకే పరిమితమవ్వడం విశేషం. ఒమన్ జట్టు సైతం ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. 2024లో నెదర్లాండ్స్పై ఏకంగా 43.3 ఓవర్లను స్పిన్నర్లే వేశారు.
No place for pace in Dhaka as West Indies deliver the most overs of spin in a men’s ODI innings!
Previous highest was 44 overs – bowled by Sri Lanka on three separate occasions: vs WI in 1996, NZ in 1998 and AUS in 2004
👉 https://t.co/vyxQnAbbwa | #BANvWI pic.twitter.com/8C3CR7uq2g
— ESPNcricinfo (@ESPNcricinfo) October 21, 2025
మిర్పూర్లో జరగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (Shai Hope) తన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పేసర్లను కాదని మొత్తం ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించాడు. అకీల్ హొసేన్, రోస్టన్ ఛేజ్, ఖారీ పియెర్రీ, గుడకేశ్ మోతీ, అలిక్ అథనాజే.. ఈ ఐదుగురు స్పిన్నర్లతో తలా పది ఓవర్లు ఇచ్చాడు. దాంతో.. వన్డే చరిత్రలో ఇన్నింగ్స్ ఓటా మొత్తం స్పిన్నర్లు వేసిన మొదటి జట్టుగా విండీస్ సరికొత్త రికార్డు నెలకొల్పింది.