RSA vs WI : సెంచూరియన్ గ్రౌండ్లో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రొవ్మన్ పావెల్ (43) విరోచితంగా ఆడడంతో మరో మూడు బంతులు ఉండగానే మ్యాచ్ ముగించింది. దాంతో, టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
వర్షం కారణంగా మ్యాచ్ను 22 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 11 ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 131 రన్స్ చేసింది. డేవిడ్ మిల్లర్ (48) మాత్రమే రాణించాడు. చెలరేగి ఆడిన పావెల్ 18 బంతుల్లో ఒక బౌండరీ, ఐదు సిక్స్లు కొట్టాడు.
132 టార్గెట్తో బరిలోకి దిగిన కరీబియన్ జట్టును బ్రాండన్ కింగ్ (23) నికోలస్ పూరన్ (16), జాన్సన్ చార్లెస్ (28) తక్కువకే పెవిలియన్ చేరారు. అయితే.. వీళ్లు ఔటయ్యాక.. రొవ్మన్ పావెల్ (43) జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. రోస్టన్ ఛేజ్(4)తో కలిసి జట్టును గెలిపించాడు. పార్నెల్ వేసిన ఆఖరి ఓవర్లో 8 పరుగులు కావాలి. అయితే.. తొలి బంతికి పరుగురాలేదు. తర్వాత వైడ్. దాంతో, 7 రన్స్ అవసరమయ్యాయి. రెండో బంతిని స్క్వేర్ లెగ్ దిశగా పావెల్ స్టాండ్స్లోకి పంపించాడు. నాలుగో బంతికి సింగిల్ తీయడంతో విండీస్ గెలుపొందింది.