WestIndies Vs India 3rd T-20 | టీం ఇండియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్లో టీం ఇండియా బౌలర్లను చెండాడుతున్న వెస్టిండీస్ ఓపెనర్ క్లే మేయర్స్.. భువనేశ్వర్ బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికీ క్లే మేయర్స్ స్కోర్ 73 పరుగులు జట్టు స్కోర్ 128 పరుగులు. అంతకుముందు 5 ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్లో 14వ ఓవర్లో నాలుగో బంతిని ఆడబోయిన వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ నేరుగా రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో వెస్టిండీస్ రెండో వికెట్ కోల్పోయింది.
అప్పటి వరకు వెస్టిండీస్ స్కోర్ 109 పరుగులు. అంతకుముందు 15వ ఓవర్ తొలి బంతిని పూరన్ సిక్సర్గా మలచడంతో వెస్టిండీస్ స్కోర్ 105 పరుగులకు చేరింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ క్లీన్ బౌల్డ్తో క్రీజ్లోకి వచ్చిన వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్.. నిలకడగా.. మరో ఓపెనర్ క్లే మేయర్స్కు సపోర్ట్ చేస్తున్నాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో 14వ ఓవర్లో క్లే మేయర్స్ మూడు ఫోర్లు బాదాడు.