న్యూఢిల్లీ: కబడ్డీ ప్రపంచకప్ తొలిసారి ఆసియా ఆవల జరుగనుంది. ఇప్పటి వరకు 10 ప్రపంచకప్లు నిర్వహించగా.. అవన్నీ ఆసియా ఖండంలోనే జరిగాయి. 2025 కబడ్డీ వరల్డ్కప్ను వెస్ట్ మిడ్ల్యాండ్స్(ఇంగ్లండ్)లో నిర్వహించనున్నట్లు ప్రపంచ కబడ్డీ సమాఖ్య శుక్రవారం వెల్లడించింది. 10 ప్రపంచకప్లలో తొమ్మిది టైటిల్స్ సాధించిన భారత్.. మట్టి ఆటకు మకుటం లేని రారాజుగా కొనసాగుతుండగా.. ఇటీవలే యూరప్లో కబడ్డీకి ఆదరణ పెరిగింది. బ్రిటీష్ కబడ్డీ లీగ్, స్కాటిష్ కబడ్డీ లీగ్, ఇంగ్లండ్ కబడ్డీ లీగ్లు విజయవంతంగా సాగుతుండటంతో ఈసారి వేదికను యూకేకు కేటాయించినట్లు కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు అశోక్ దాస్ తెలిపారు.